Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు కసరత్తు
న్యూఢిల్లీ: అప్పుల భారాన్ని మోస్తున్న ఎయిరిండియా.. లక్నో నగరం నుంచి ఢిల్లీ మీదుగా ఇరాక్లోని నజాఫ్ నగరానికి విమాన సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తున్నది. నజాఫ్ నగరాన్ని ముస్లింలోని షియా వర్గీయులు పవిత్రంగా భావిస్తారు. అయితే లక్నోలోనూ షియా ప్రాబల్యం ఉండటం గమనార్హం. ఈ మార్గంలో సేవలు అందించేందుకు ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని, సోమవారం వరకు ఎయిర్లైన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త విమాన మార్గాన్ని ప్రకటించేముందు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయని అన్నారు. ఈ విమాన మార్గానికి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సోమవారం సమావేశంకానున్నారని తెలిపారు. ఈ సేవలను ప్రారంభించడంపై ఈ చర్చలో ఓ నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నదని చెప్పారు. కాగా, నజాఫ్లో విమాన సిబ్బంది తాత్కాలిక బసకు పలుసమస్యలున్నాయని, అందుకే సౌదీ అరేబియాలోని మదీనాలో బస కోసం జాయింట్ ఫ్లైట్ ప్రతిపాదన ఉన్నదని తెలిపారు. ఇందుకోసం ఈ మార్గానికి వినియోగించా లనుకుంటున్న ఎయిర్బస్ ఏ320 నియోకు ఈడీటీఓ అనుమతులను ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ నుంచి తీసుకోవాల్సి ఉన్నదని వివరించారు.