Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ అప్పగిస్తుందా?
- నేడు తీర్పు చెప్పనున్న 'వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్'కోర్టు
- యూకే హైకోర్టు అనుమతి అవసరం!
లండన్ : భారతదేశ రాజకీయాల్ని, బ్యాంకుల్ని, ఆర్బీఐ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన అంశం బడా పెట్టుబడిదారుల బ్యాంకు రుణ ఎగవేతలు. అందులో విజరు మాల్యా రుణ ఎగవేత కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం అతడు బ్రిటన్లో దాక్కున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రుణ ఎగవేత కేసులో 'వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్' కోర్టు ఇచ్చే తీర్పును బట్టి, బ్రిటన్ అతడ్ని భారత్కు అప్పగిస్తుందా? లేదా?అన్నది తేలిపోతుంది. ఏడాదికాలంగా కేసును విచారిస్తున్న ఈ న్యాయస్థానం నేడు తీర్పు చెప్పనున్నది. విజరుమాల్యాకు వ్యతిరేకంగా తీర్పుగనుక వస్తే, దీనిని బ్రిటన్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. కోర్టు తీర్పును సవాల్ చేయకపోతే, హైకోర్టు అనుమతి కోసం వెళ్లకపోతే...28రోజుల్లోగా (వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చిన) మాల్యాను భారత్కు అప్పగించాల్సిందే. 9వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాడని, మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డాడని ఈకేసులో ఇండియా ఆరోపించింది. అతడ్ని తమకు అప్పగించాల్సిందిగా భారత్ వాదించింది. దీంతో అతడు అరెస్టుకాగా, కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. గతేడాది ఏప్రిల్ నుంచి విజరుమాల్యా బెయిల్పై ఉన్నాడు. తనపై మోపబడిన కేసులు, ఆరోపణలు అన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈకేసుల వల్ల కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను పూర్తిస్థాయిలో నడిపించలేకపోతున్నానని కూడా చెప్పాడు.
తీర్పు చెప్పే సమయం వచ్చేసరికి..
''బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అసలు ఆ రుణం తీసుకున్నది 'కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్'. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వ్యాపార కార్యకలాపాలు బాగోలేక, నష్టాలు రావటం మూలాన రుణం చెల్లించలేకపోయాను. తీసుకున్న రుణాన్ని 100శాతం చెల్లిస్తానని చెప్పాను''అని ట్విట్టర్లో విజరుమాల్యా చేసిన ప్రకటన మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
ఈ కేసులో వెస్ట్మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి ఎమ్మా ఆర్బూత్నాట్ సోమవారం తీర్పు చెప్పబోతున్నారనగా, కొద్ది రోజుల ముందు విజరుమాల్యా నుంచి పై మాటలు వెలువడ్డాయి. ఎందుకంటే ఈ కేసులో తాను మోసగాడ్ని కాదన్న అభిప్రాయం కలిగించడానికే ట్విట్టర్ ద్వారా ప్రకటనలు చేశాడు.
ఏడాదికాలంగా వాదనలు
గత ఏడాదికాలంగా కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటోంది. భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్(సీపీఎస్) బృందం, విజరు మాల్యా తరఫున న్యాయవాది క్లేర్ మోంట్గోమెరా నేతృత్వంలోని బృందం వాదనలు వినిపించారు. విజరు మాల్యా మనీలాండరింగ్కు పాల్పడ్డారని, బ్యాంకుల్ని మోసం చేశారని భారత్ ఆరోపించింది. అతడ్ని తమకు అప్పగించాలని భారత్ కోరింది. అయితే ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని విజరు మాల్యా తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. దీనిని అడ్డుపెట్టుకొని విజరుమాల్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సహజంగా ఏర్పడిన నష్టాల వల్లే ఇది జరిగింది తప్ప, విజరుమాల్యా బ్యాంకుల్ని మోసం చేయలేదని, ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని వారు వాదించారు. తీసుకున్న రుణం అసలులో 80శాతం చెల్లించడానికి విజరుమాల్యా ముందుకు వచ్చాడని, కానీ బ్యాంకింగ్ కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్బీఐ మాల్యా ఆఫర్ను తిరస్కరించిందని వారు పేర్కొన్నారు. విజరు మాల్యా తరఫు న్యాయవాదుల వాదనను సీపీఎస్ బృందం కోర్టులో ఖండించింది. మాల్యా తన రుణాన్ని తిరిగి చెల్లించే ఉద్దేశాన్ని ఎప్పుడూ వ్యక్తం చేయలేదని, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కుప్పకూలటం అతడికి ముందే తెలుసునని, ప్రపంచ విమానయాన రంగంలో నెలకొన్న పరిస్థితుల్ని చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సీపీఎస్ బృందం కోర్టుకు తెలిపింది. రుణం చెల్లించాలంటూ బ్యాంకులు చర్యలు చేపడతారని తెలిసి దేశం నుంచి మాల్యా దొంగలాగా పారిపోయారని వారు ఆరోపించారు.