Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: భారత్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజరు మాల్యాకు బ్రిటన్లోని కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాను భారత్కు అప్పగించే విషయంలో సోమవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు మాల్యాపై ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కూటమి న్యాయపరమైన చర్యలు ప్రారంభించిన క్రమంలో 2016లో విజరు మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్కు అప్పగించాలని బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. భారత ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించారు.