Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ శ్రేణీ నగరాలకు పీవీఆర్ సినిమాస్ తెరలను విస్తరిస్తామని ఆ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో ఏర్పాటు చేసిన మల్టీప్లెక్స్ను ఆయన సోమవారం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సంజీవ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్ పట్టణాలతో సహా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ నగరాలపై దృష్టి సారిస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 8 మల్లీప్లెక్స్ల్లో 47 తెరలు కలిగి ఉన్నామన్నారు.