Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ బీమా రంగ సంస్థ భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ సెప్టెంబరుతో ముగిసిన తొలి ప్రథమార్థంలో (ఏప్రిల్-సెప్టెంబరు) రూ.3.3 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ దాదాపు రూ.59.3 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏడాదికేడాదితో పోల్చితే క్రితం ప్రథమార్థంలో సంస్థ స్థూల ప్రీమియం వసూళ్లు 38 శాతం పెరిగి రూ.1,087 కోట్లకు చేరాయని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ సామర్థ్యం పెంచుకోవడంతో పాటు డిజిటైజేషన్, ఆటోమేషన్పై దృష్టి సారించడం తమకు కలిసి వచ్చిందని భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సంజీవ్ శ్రీనివాసన్ తెలిపారు. దీంతో ప్రథమార్థంలో సంస్థ మెరుగైన ఫలితాలు సాధించగలిగిందన్నారు.