Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. తన బెంచ్మార్క్ వడ్డీరేట్లను 0.05శాతం (5 బేసిస్ పాయిం ట్లను) పెంచినట్లు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, రుణాలు, రిటైల్ వ్యక్తిగత రుణాలు రుణాలు భారం కానున్నాయి. సవరించిన వడ్డీరేట్లు డిసెంబర్ 10నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. దీంతో ఏడాది పరిమితి గల రుణాలపై వడ్డీరేటును 8.50 నుంచి 8.55కి చేరగా, 2-3 సంవత్సరాల పరిమితి రుణాలపై వరుసగా 8.66 శాతం నుంచి 8.65 శాతానికి, 8.70 శాతంనుంచి 8.75 శాతానికి సవరించింది. దీంతో ఎస్బీఐ అన్ని రకాల రుణాలపై స్టాండర్డ్ గా 0.5 శాతం వడ్డీ రేట్లు పెంచినట్టయింది.