Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధానీ నరేంద్ర మోడీ కార్యవర్గంలో మరో ఆర్ధిక నిపుణుడు వైదొలిగారు. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సూర్జిత్ భల్లా తన పదవికి రాజీనామా చేశారు. పీ ఎంఈఏసీ పాక్షిక సభ్యుడి పదవి నుంచి తాను డిసెంబర్ 1 నుంచి వైదొలిగినట్లు మంగళవారం భల్లా ఉదయం ట్విట్టర్లో తెలిపారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ ఒబెరారు నేతత్వంలో పీఎంఈఏసీలో ఆర్ధికవేత్తలు రాతిన్ రారు, అషిమా గోయెల్, షామికా రవి ఇతర పార్ట్ టైమ్ సభ్యులు ఉన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకంపనలు ముగియకముందే భల్లా అంశం బయటికి రావడంతో మోడీ సర్కార్పై ఆర్థిక విధానాలపై ప్రజల్లో విశ్వాసం మరింత సన్నగిల్లే అవకాశం ఉంది. ఉర్జిత్ పటేల్ కంటే ముందు ఎందరో ఆర్ధిక నిపుణులు మోడీ ప్రభుత్వం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మోడీ నోట్ల రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించడంతో రాజన్కు మరో అవకాశం ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్, నీతి అయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనాగరియా రాజీనామా చేశారు.