Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చమురు ధరలు కాస్త శాంతించిన నేపథ్యంలో దేశంలో ధరలు దిగివచ్చాయి. గత నవంబర్ మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 2.33 శాతానికి తగ్గి 17 నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. అంత క్రితం అక్టోబర్ మాసపు సీపీఐని 3.31 శాతం నుంచి 3.38 శాతానికి సవరించినట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గత ఏడాది నవంబర్ మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ 4.88 శాతంగా ఉంది. ముఖ్యంగా కూరగాయలు, కోడిగుడ్లు, పప్పుల ధరలు దిగిరావడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది. దేశంలో వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకొనే ముందు ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసకుంటుంది. గత ఏడాది జూన్లో 1.46 శాతం కనిష్టానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆ తరువాత ఇంత కనిష్టానికి చేరడం ఇదే తొలిసారి.
11 నెలల గరిష్టానికి పారిశ్రామికం
దేశ పారిశ్రామికోత్పత్తిల్లో పురోగతి నమోదు అయింది. గత అక్టోబరు మాసంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 8.1 శాతానికి పెరిగి 11 మాసాల గరిష్ట స్థాయికి చేరిందని ప్రభుత్వం తెలిపింది. అక్టోబరు మాసంలో గనులు, విద్యుత్తు, తయారీ రంగాలు మెరుగైన ప్రగతిని కనబర్చాయని ప్రధాన గణాంకాల కార్యాలయం(సీఎస్వో) తెలిపారు. గతేడాది ఇదే అక్టోబర్లో మాసంలో ఐఐపీ వృద్ధి 1.8 శాతంగా నమోదు అయింది. గతంలో 2017 నవంబర్లో ఐఐపీ గరిష్టంగా 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత అత్యధికంగా ఐఐపీ రాణించడం గల అక్టోబర్లోనే జరగడం విశేషమని సీఎస్వో కార్యాలయం తెలిపింది. 23 పరిశ్రమ గ్రూపుల్లో 21 సూచీలు కూడా సానుకూల వృద్ధిని సాధించడం వల్ల మెరుగైన ఐఐపీ నమోదు అయినట్టుగా ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి