Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ విప్లవాన్ని ఆసరగా చేసుకొని వీసా గ్రూపు తన వ్యాపారాన్ని విస్తరిస్తూపోతోంది. తాజాగా ఆ సంస్థ దేశంలోని కాంటాక్ట్లెస్ కార్డుల జారీలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వీసా సంస్థ భారత్లో ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్లకు పైగా కాంటాక్ట్లెస్ కార్డులను జారీ చేసినట్టుగా బుధవారం వెల్లడించింది. ఈ సందర్భంగా వీసా గ్రూపు కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ కేవలం మూడేండ్ల కాలంలోనే తాము కాంటాక్టులెస్ కార్డుల జారీలో పెద్ద మైలురాయిని చేరినట్లయిదని వివరించారు. వీసా జారీ చేసే ఈ కార్డులను అనుమతించేలా భారత్లో 10 లక్షలకు పైగా టర్మినల్స్ను ఏర్పరిచినట్లు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 33 లక్షల మంది వ్యాపారులు వివిధ చెల్లింపుల ఆప్షన్ల్ల ద్వారా నగదు రహిత చెల్లింపులను ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. 2018 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల కాంటాక్టు లెస్ పేమెంట్ కార్డులు జారీ అయ్యే అవకాశాలున్నాయని తాము భావిసున్నామన్నారు. మొత్తం కార్డుల్లో వీటి వాటా సగానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.