Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేద్ త్వరలోనే స్టాక్మార్కెట్లో అడుగు పెట్టనుంది. గురువారం ఈ విషయాన్ని సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సూచనప్రాయంగా వెల్లడించారు. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను పతంజలి స్టాక్మార్కెట్లో లిస్టిం గ్కు తీసుకొచ్చే యోచన ఏమైనా ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, దానికి బాబా రామ్దేవ్ సమాధానమిస్తూ 'ఈ నెలలోనే మీరు ఒక శుభవార్త వింటారు' అని అన్నారు. చిన్న ఫార్మసీ సంస్థగా ప్రారంభమైన పతంజలి శాఖోపశాఖలుగా విస్తరించింది. అంతేకాదు, ఎఫ్ఎంసీజీ రంగంలోనూ అడుగుపెట్టి పెద్ద పెద్ద సంస్థలకు కంటి మీద కును కులేకుండా చేసిన సంగతి తెలిసిందే. రాబోయే ఐదేళ్లలో రూ.20వేల కోట్ల వార్షిక టర్నోవర్ సాధించాలని పతంజలి లక్ష్యంగా పెట్టుకుంది.