Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీఏ నిబంధనలపై చర్చలు
- గంటన్నర పాటు మంతనాలు
- నేడు ఆర్బీఐ బోర్డు కీలక మీట్
ముంబయి: బ్యాంకులు ఎదుర్కొంటున్న నిరర్థక ఆస్తుల సమస్య నుంచి బయటపడేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కఠినంగా అమలులోకి తెచ్చిన సరైన దిద్దుబాటు చర్యలు (పీసీఏ) నిబంధనల నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు త్వరలోనే ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆర్బీఐ కొత్త గవర్నర్ శక్తికాంత దాస్తో సమావేశమైన ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలు తమ బేటీలో పీఏసీ నిబంధనల విషయమై ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. బ్యాంకులను పీఏసీ ప్రతిబంధకాలను విధించడం కూడా ఆర్బీఐ-ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావడానికి ప్రధానాంశంగా నిలిచిన సంగతి తెలిసిందే. పీఏసీ నిబంధనలను అమలులోకి తెచ్చిన ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసి కొత్త గవర్నర్ అధికారంలోకి రాగానే బ్యాంకులు పీఏసీ కఠిన నిబంధనలను సవరించాలంటూ మళ్లీ గళం విప్పడం గమనార్హం. కాగా ఈ అంశంలో ప్రభుత్వం కూడా బ్యాంకర్ల వైపే ఉండడం విశేషం. ప్రస్తుతం పీసీఏలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. శుక్రవారం జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో పీసీఏ నిబంధనలను సవరించే అంశంపై చర్చ జరిగే అవకాశం కని పిస్తోంది. దాదాపుగా గంటన్నర పాటు ఆర్బీఐ గవ ర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లతో బ్యాంకర్ల భేటీ జరిగింది. ఈ సమావేశంలో కొత్త గవర్నర్ పీసీఏ వల్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిం చారని బ్యాంకర్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యుబీఐ, సెంట్రల్ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అధినేతలు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం ఆర్బీఐ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.