Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (ఐవోసీ) 3.06 శాతం మేర షేర్లను బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. సదరు ప్రతిపాదనకు ఐవోసీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ బైబ్యాక్ విలువ రూ.4,435 కోట్లుగా అంచనా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైబ్యాక్లో 29.76 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రత్యేక బైబ్యాక్ ఆఫర్కు గాను ధరను సంస్థ రూ.149గా నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యూలేటరీకి అందజేసిన ఫైలింగ్లో పేర్కొంది. దీనికి తోడు 2018-19 సంవత్సరానికి గాను ప్రతిషేర్కు రూ.6.75 చొప్పున మధ్యంతర డెవిడెండ్ను కూడా కంపెనీ సిఫార్స్ చేసింది. ఇరాన్ నుంచి పూర్తిస్థాయిలో చమురు కొనుగోలు చేస్తామని ఐవోసీ ప్రకటించింది.