Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో రూ.30,000 కోట్ల మేర మూలధన సాయాన్ని అందించాలని సర్కారు యోచిస్తోంది. బ్యాంకులు అనుకున్న స్థాయిలో మార్కెట్ల నుంచి తమకు కావాల్సిన నిధుల సమీకరించలేక పోతున్న కారణంగా ఈ సాయాన్ని అంది ంచాలని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. 2017 అక్టోబరులో ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 'బ్యాంకుల మూలధన సాయపు పథకం'లో భాగంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి దాదాపు రూ.58,000 కోట్ల మేర నిధులను మార్కెట్ల నుంచి సమీకరించాల్సి ఉంది. కానీ మార్కెట్ల పరిస్థితులు స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో బ్యాంకులు అనుకున్న స్థాయిలో బ్యాంకులు నిధుల సమీకరణ జరపలేకపోతున్నాయి. ఇప్పటికే ఉన్న నిరర్థక ఆస్తులకు తోడు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల కాలంలో బ్యాంకులు నిధుల లభ్యత లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సర్కారు ఆయా బ్యాంకులకు అదనంగా మూలధనం సాయం చేయాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సాయాన్ని కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులోపే దశల వారీగా అందించే దిశగా ప్రణాళికలు రచించాలని ఆధికారులకు సర్కారు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది.