Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా భారత్లోనే తొలిసారిగా అత్యాధునిక మానవరహిత వాయు వాహనాల (యూఏవీ) తయారీ జరగనుంది. ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సంస్థలు చేతులు కలిపాయి. యూఏవీ తయారీకి సంబంధించి రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన 'అదానీ ఎల్బిట్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ కాంప్లెక్స్'కు తెలంగాణ హోమ్ శాఖ మంత్రి మహముద్ఆలీ శుక్రవారం ప్రారంభించారు. దాదాపు 50,000 చదరపు అడుగు విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 900 మీడియమ్ ఆల్టిట్యూట్ లాంగ్ ఎండ్యురెన్స్ యూఏవీ వాహనాలకు కార్బన్ కాంపోజిట్ ఏరో స్ట్రక్చర్ను రూపొందించి అసెంబ్లింగ్ జరపనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.సిన్హా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ అదానీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ల సీఈవో కరణ్ అదానీ, ఎల్బిట్ సిస్టమ్స్ సంస్థ సీఈవో బెజాహిలెల్ మెచ్లిస్ తదితరులు పాల్గొన్నారు.