Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కావాల్సిన స్థాయిలో ఉద్యోగ సృష్టి జరగడం లేదు..
- రైతుకు రుణ మాఫీ వద్దని ఈసీకి లేఖ రాశా: రాజన్
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మోడీ సర్కారుపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితుఇలో గడిచిన ఐదేండ్ల కాలంలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దేశ అవసరాల మేరకు భారత ఆర్థిక వ్యవస్థ తగినన్ని ఉద్యోగాలను సృష్టించడంతో విఫలమైందని ఆయన అన్నారు. ఇందుకు ఆయన ఉదాహరణనిస్తూ ఇటీవల జరిగిన రైల్వే నియమకాల్లో 90వేల రైల్వే ఉద్యోగాలకు రెండున్నర కోట్ల మంది దరఖాస్తు చేసుకున్న పరిస్థితిని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి 250 మంది పోటీ పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే దేశంలో ఎంతగా నిరుద్యోగం పేరుకుపోయిందే అర్థమమవుతోందని అన్నారు. భారత్ తక్షణం ద్రవ్య లోటును పూడ్చుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి పైగా నమోదు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.రైతులకు రుణమాఫీ చేస్తామని ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇస్తుండడాన్ని రాజన్ ఆక్షేపించారు. దేశంలో ఇలాంటి చర్యలు మంచివి కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదని తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి ఉండకూడదనికేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాసినట్లు ఆయన తెలిపారు. 'వ్యవసాయ రంగానికి, రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అంతమాత్రాన రుణమాఫీలు చేయడం, పంట మద్దతు ధర పెంచుతామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వంటివి చేయడం సరికాదు' అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలోనూ ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి హామీలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అపారమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగాలొచ్చే రంగాలపై మరింత ప్రభుత్వం ఉద్యోగ సృష్టి ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టి ్ట పెట్టాలని ఇటీవల రాజన్ సూచించిన విషయం తెలిసిందే. వ్యవసాయం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి రంగాలపై దృష్టి సారించి.. వాటిని తిరిగి వృద్థి పథంలోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు.