Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్సిస్-ఎయిర్సెల్ కేసు ఎఫెక్ట్
ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్సేంజీ ఆఫ్ ఇండి యా (ఎన్ఎస్ఈ) చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా చేశారు. ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో ఆయనకు పాత్ర ఉందని ఈ మధ్య కాలంలో వచ్చిన రిపోర్టు లతో వైదొలగాల్సి వచ్చిందని తెలుస్తోంది. కాగా చావ్లా రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఎన్ ఎస్ఈ శుక్రవారం వెల్లడించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సెబీ కూడా విచారణ జరపనుంది. ఎయిర్సెల్- మాక్సిస్ కేసులో చావ్లాతో పాటు మరో నలుగురు అధికారులను విచారిం చడానికి అనుమతి నివ్వాలని సీబీఐ శుక్రవారం ఢిల్లీలోని స్పెషల్ కోర్టును కోరింది. ఆర్ధిక ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎవరైనా స్టాక్ ఎక్సేంజీ నిర్వహణలో ఉండకూడదని సెబీ స్టాక్ ఎక్సేజీ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్స్ (ఎస్ఈసీసీ) నిబంధనలు పేర్కొంటున్నాయి. చావ్లాపై రెండు ఫిర్యాదులు రావడంతో సెబీ కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే చావ్లా వైదొలిగారని తెలుస్తోంది. అదే విధంగా ఈ కేసులో ప్రధాన అరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిని ఫిబ్రవరి 1 వరకు అరెస్ట్ చేయకుండా స్పెషల్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నపుడు మ్యాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్కి రూ.3,680 కోట్ల మేర ఎఫ్ఐపీబీ అనుమతులు జారీ చేసింది. రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీనే అనుమతులివ్వాలి. చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి ఎలా అనుమతులిచ్చారనే విషయమై దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న విషయం తెలిసిందే. మాక్సిస్కు అనుమతులిచ్చిన సమయంలో చావ్లా ఆర్ధిక వ్యవహారాల అదనపు కార్యదర్శితో పాటు, ఎఫ్ఐపీబీలో సభ్యులుగా ఉన్నారు.