Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ఆదాయంలో పెరుగుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కంపెనీ రెవెన్యూలో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. కాగా ప్రయాణికుల సంఖ్యలో మాత్రం 4 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఉన్న విమానాలను చక్కగా, ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడం వల్ల ఈ ఆదాయం పెరిగిందని ఎయిరిండియా ఉన్నతాధికారి ఒక్కరు తెలిపారు. 2018-19 క్యూ3లో ప్రయాణికుల నుంచి రూ.5,538కోట్ల రెవెన్యూ వచ్చిందన్నారు. 2017-18 ఇదే డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.4,615కోట్ల ఆదాయం నమోదయ్యిందన్నారు. ఇదే సమయంలో 53.28లక్షల ప్రయాణికులను గమ్యానికి చేర్చామని, కాగా 2018-19 క్యూ3లో ప్రయాణికుల సంఖ్య 55.27లక్షలుగా నమోదైందన్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్యలో 4శాతం పెరుగుదల చోటు చేసుకుందన్నారు.