Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఐటీ సేవల సంస్థ సైయెంట్ డిసెంబరుతో ముగిసన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో సంస్థ నికర ఏడాది ప్రతిపదికన లెక్కించి చూస్తే 4.9 శాతం మేర పెరిగి రూ.92.1 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.87.8 కోట్లుగా నమోదు అయింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో సంస్థ ఆదాయం 20.8 శాతం మేర పెరిగి రూ.983.4 కోట్ల నుంచి రూ.1,187.6 కోట్లకు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సైయెంట్ సంస్థ డిసెంబరు ముగింపు నాటికి రూ.1,230 కోట్ల మేర నగదు నిల్వలను ప్రకటించింది. సంస్థ గతంలో మాదిరిగానే డివిడెండ్ పాలసీకి కట్టుబడి ఉండనున్నట్టుగా సైయెంట్ వెల్లడించింది. డిసెంబరు మాసంలో వరుస సెలవులతో పాటు వివిధ ఇతర కారణాల వల్ల స్తబ్దత కనిపిస్తుందని అయినా స్థిర కరెన్సీ మారకం ప్రాతిపదికన ఇయర్ ఆన్ ఇయర్తో పోలిస్తే సంస్థ 10.7 శాతం వృద్ధిని నమోదు చేసినట్టుగా సైయెంట్ సంస్థ ఎండీ, సీఈవో కృష్ణా బోధనపు వెల్లడించింది. రానున్న త్రైమాసికంలో మెరుగైన వృద్ధిని నమోదు చేయనున్నట్టు ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.