Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకనామిక్ సెన్సెస్లో భాగంగా డేటా సేకరణ
- నిత్యం నవీకరణలకు ఏర్పాట్లు..
న్యూఢిల్లీ: దేశంలోని వ్యాపార సంస్థల వివరాలన్నింటినీ క్రోఢకీరిస్తూ 'వ్యాపార సంస్థల రిజిస్టర్'ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2019-20లో చేపట్టనున్న ఎకనామిక్ సన్సెస్ (జాతీయ ఆర్థిక కార్యకలాపాల లెక్కల సేకరణ) కార్యక్రమంలో భాగంగా సర్కారు ఈ వ్యాపార సంస్థల రిజిస్టర్ను రూపొందించాలని భావిస్తున్నట్టుగా జాతీయ గణాంకాలు, ప్రభుత్వ పథకాల అమలు శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత 'వ్యాపార సంస్థల రిజిస్టర్'లో దేశంలోని అన్ని వ్యాపారాల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు.. దానిని అనునిత్యం నవీకరించేలా రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు.రిజస్టర్లోని సమాచారాన్ని భాగస్వామ్య సంస్థలతో సహా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వివిధ అవసరాలకు వాడుకొనేలా రూపొందించనున్నట్టుగా శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకు గాను సీఎస్సీ ఎస్పీవీని టెక్నాలజీని వినియోగిస్తున్నట్టుగా ఆయన వివరించారు. తాము సమీకరించే సమాచారంతో విలువై, నాణ్యమైన డేటా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. ఆర్థిక లెక్కల సేకరణ వల్ల సమయానుకూలంగా సమాచార సేకరణతో పాటు జాతీయ స్థాయిలో ఉన్న అస్తుల విలువ లెక్కించేందుకు వీలు పడుతుందని.. తద్వారా వివిధ విధాన స్థాయిల్లో అవసరం మేరకు జోక్యానికి వీలుకలుగుతుందని ఆయన అన్నారు. సీఎస్సీ దేశ వ్యాప్తంగా మూడు లక్షల సాధారణ సేవా కేంద్రాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. వీటిని రానున్న రోజుల్లో ఆర్థిక సర్వే కార్యక్రమానికి వినియోగించనున్నుట్టు తెలిపారు. ఇందుకోసం ఒక్కో కేంద్రం నుంచి దాదాపు ఐదుగురు ఎన్యుమరేటర్లకు శిక్షణనివ్వనున్నట్టుగా ఆయన తెలిపారు. ఆర్థిక గణాంకాల సేకరణకు దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఎకనామిక్ సేన్సెస్ కోసం లోతైన సర్వే, డేటా సంగ్రహనం జరపాల్సిన అవసరం ఉన్నందున ప్రభుత్వం 1977 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లు మాత్రమే ఎకనామిక్ సెన్సెస్ కార్యక్రమాన్ని చేపట్టింది.