Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలంగాణలో తమ సేవలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో బ్యాంక్ అవుట్లెట్ను ప్రారంభించడం ద్వారా తాము తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అడుగుపెట్టినట్టయిందని సంస్థ సీఈవో, ఎండీ రాజేశ్ యాదవ్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో ఐద శాఖలను, ఆంధ్రప్రదేశ్లో ఐదు శాఖలను తెరిచే విధంగా తాము ముందుకు సాగుతున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు.. ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలుపుకొని 134 జిల్లాల్లో 532 శాఖలతో విస్తరించి ఉన్నామన్నారు. 17 మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పని చేస్తున్న ఫ్యూచర్ ఫైనాన్స్, దిశా మైక్రో ఫైనాన్స్లు సంయుక్త భాగస్వామ్యంలో ఫిన్ కేర్ ఎస్ఎఫ్బిని ఏర్పాటు చేశాయన్నారు. ప్రస్తుతం రూ.2,836 కోట్ల స్థూల రుణాలు, రూ.1432 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నామన్నారు. ఇప్పటి వరకు 14 లక్షల ఖాతాదారులను చేరామని తెలిపారు. తమ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 1.36 శాతంగా, నికర నిరర్ధక ఆస్తులు 0.3 శాతంగా ఉన్నాయన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఇదే అత్యల్పమని అన్నారు. 2020-21 నాటికి రూ.10వేల కోట్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎమ్)ను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇదే సమయంలో 40 లక్షల ఖాతాదారులను చేరాలని నిర్దేశించుకున్నామన్నారు. త్వరలో ఎపిలోని గుంటూరు, విజయవాడ, రాజమండ్రి తదితర పట్ణణాల్లో కొత్త శాఖలు తెరువనున్నామని ఫిన్కేర్ బిజినెస్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ దశరత్ రెడ్డి తెలిపారు. ఆర్ధిక సంవత్సరం 2020-21 నాటికి ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బి) 5000 శాఖలకు విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.