Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: 'ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్'కు (ఓబీసీ) పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు గాను సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఆ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్లే ఎస్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన హైదరాబాద్, విజయవాడకు చెందిన సర్కిల్ ఉద్యోగ సభ్యులతో టౌన్హాల్ మీటింగ్ను నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రెండు నగరాల్లోని బ్యాంకు ప్రగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సర్కిల్ హెడ్ అరుణ్ కుమార్ అగర్వాల్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. అనతరం ఈడీ మాట్లాడుతూ సిబ్బంది ఒక జట్టుగా రాణించి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం ద్వారా ఓబీసీని వీలైనంత త్వరగా పీసీఏ నిబంధనల నుంచి బయటపడేసేలా కృషి చేయాలని కోరారు. దృఢ సంకల్పంతో జట్టుగా రాణిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని ఆయన అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులు కృషి చేయాలని బాలక్రిష్ణ సూచించారు. ఈ సందర్భంగా మెరుగ్గా రాణించిన శాఖల మేనేజర్లను ఈడీ సత్కరించారు. మేటి పనితీరుతో రాణించిన వారికి ప్రశంసా పత్రాలను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్, విజయవాడకు సర్కిల్ కార్యాలయానికి చెందిన అధికారులు ఉద్యోగులతో పాటు జంటనగరాలలోని ఓబీసి బ్యాంక్నకు చెందిన శాఖత ఉద్యోగులు, శాఖల సభ్యులు పాల్గొన్నారు.