Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూపులోకి అంబానీల మరో వారసుడు అడుగుపెట్టాడు. అనిల్ అంబానీకి చెందిన చిన్న కుమారుడు 23 ఏండ్ల అన్షూల్ అంబానీ సంస్థలోకి అడుగు పెట్టినట్టుగా రిలయన్స్ గ్రూపు తెలి పింది. న్యూయార్క్లోని స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మేనేజ్మెంట్ యూజీ పట్టా పొందిన అనంతరం అన్షూల్ రిలయన్స్ ఇన్ఫ్రాలో మేనేజ్ మెంట్ ట్రైనీగా చేరారని సంస్థ శనివారం వెల్లడించింది. రిలయన్స్ గ్రూపు నకు రిలయన్స్ ఇన్ఫ్రా ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రిలయన్స్ గ్రూపునకు చెందిన విద్యుత్తు ఉత్పత్తి, ముంబ యి లాంటి మెట్రో నగరాలలో విద్యుత్తు పంపిణీ, రిలయన్స్ డెఫెన్స్, రిలయన్స్ రోడ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ప్రాజెక్ట్స్ తదితర వ్యాపారాలకు రిలయన్స్ ఇన్ఫ్రా హౌల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. అనిల్ అంబా నీకి చెందిన పెద్ద కుమారుడు కూడా అన్మోల్ కూడా 2014లో చదుపు పూర్తి చేసుకొని తొలత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ట్రైనీగానే గ్రూపు లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన రియలన్స్ క్యాపిటల్లో చేరారు. ప్రస్తుతం అన్మోల్ రిలయన్స్ గ్రూపునకు చెందిన విదేశీ ఆర్థిక సేవల వ్యాపారాన్ని కూడా అన్మోల్ నిర్వహిస్తున్నారు.