Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: యమహా ఇండియా మోటార్ గ్రూపు ప్రీమియం శ్రేణిలో కొత్త బైక్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఎఫ్జెడ్-ఎఫ్1, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్1 మోడళ్లను సోమవారం బెంగళూరులో ఇండియా యమహా మోటార్ గ్రూపు ఛైర్మన్ మోటోఫుమి షిటరా ఆవిష్కరించారు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద వీటి ధరలను వరుసగా రూ.95,000, రూ.97,000గా కంపెనీ నిర్ణరుంచింది. 149 సీసీ, 4 స్ట్రోక్ ఇంజిన్తో అడ్వాన్సుడ్ బ్రేకింగ్ సిస్టమ్స్తో వీటిని సంస్థ రూపొందించినట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.