Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యు భారత మార్కెట్లోకి సరికొత్త 'బీఎండబ్ల్యు ఎక్స్4' కారును విడుదల చేసింది. సంస్థకు చెందిన స్థానిక ప్లాంట్లో తయారు చేసిన ఈ కార్లను బీఎండబ్ల్యు గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ హాన్స్ క్రిస్టియన్ బార్ట్లెస్ గూర్గావ్లో ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లు, హంగులతో చెన్నై ప్లాంట్లో రూపొందించిన సరికొత్త స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే మోడల్ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్, రెండు డీజిల్ వేరియంట్లలో తీసుకొచ్చింది. మూడు వేరియంట్లలో ఆవిష్కరించిన దీని ధరను ఎక్స్షోరూం ప్రారంభ ధర రూ.60.60 నుంచి 65.90 లక్షలుగా నిర్ణయించారు. పెట్రోలు వేరియంట్ ధరను రూ.63.5 లక్షలుగా ఉంది.భారత మార్కెట్లో లాంచ్ చేసిన ఇవి దేశవ్యాప్తంగా సోమవారం నుంచి విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ సెగ్మెంట్ను విస్తరించామనీ, ఈ విభాగంలో తమ తాజా ఎక్స్ 4 ద్వారా ఎం స్పోర్ట్స్ డిజైన్ ప్యాకేజ్ను తొలిసారిగా పరిచయం చేస్తున్నామని క్రిస్టియన్ బార్ట్లెస్ ప్రకటించారు.