Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వర్చువల్ మెడికల్ కన్సెల్టేషన్కు (వీఎంసీ) మంచి ఆదరణ లభిస్తోందని ఎంఫైన్ సంస్థ సహ వ్యవస్థాకుడు, సీఈవో ప్రసాద్ కోంపల్లి తెలిపారు. కృత్రిమ మేథస్సుతో కూడిన తమ ఎంఫైన్ యాప్ ద్వారా వైద్య సలహాలను పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆయన తెలిపారు. రానున్న ఏడాది కాలంలో తమ సేవలను 100 ఆసుప్రతులకు, 1000 మంది డాక్టర్లకు విస్తరించనున్నట్టుగా ఆయన తెలిపారు. ఎంఫైన్ ఇప్పటి వరకు 35000 కన్సెల్టేషన్లను పూర్తి చేసుకుందని వివరించారు. దేశ వ్యాప్తంగా 18 వైద్య విభాగాల్లో దాదాపు 300 మంది వైదులకు సేవలను ఎంఫైన్ ద్వారా పొందొచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో ఔషధాలతో పాటు రోగనిర్ధారణ పరీక్షలకు సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తేనున్నట్టుగా ఆయన వివరించారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో ఉన్నట్టుగా ఆయన తెలిపారు.