Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నిస్సాన్ మోటార్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని లాంచ్ చేసింది. 'కిక్స్' పేరుతో ఒక కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్యూవీని సంస్థ భారత మార్కెట్లో ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. ఎక్స్ఎల్, ఎక్స్వి, ఎక్స్వి ప్రీమియం, ఎక్స్వీ ప్రీమియం ప్లస్ అనే నాలుగు వెర్షన్స్ను తీసుకొచ్చింది. ఎక్స్ఎల్ పెట్రోల్ బేసిక్ వేరియంట్ కోసం రూ .9.55 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరగా నిర్ణయించింది. నిస్సాన్ కిక్స్ బేసిక్ వేరియంట్లో కూడా ఎడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఎసీ, వెంట్స్ నాలుగు స్పీకర్లతో ఒక బ్లూటూత్, యూఎస్బీ, ఆక్స్- ఎనేబుల్ ఆడియో సిస్టమ్ లాంటి కీలక ఫీచర్స్ను పొందుపర్చింది. ఇక టాప్ ప్రీమియం ప్లస్లో ఎరౌండ్ వ్యూ డిస్ప్లే కలిగిన 360 డిగ్రీ కెమెరాతోపాటు ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కంపాటిబిలిటీ ఇచ్చింది. ఇంకా టెలీమాటిక్స్-ఎనేబుల్ స్మార్ట్ వాచ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రెల్స్ , 8.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ లాంప్స్ క్రూయిస్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్ను జోడించింది. ఎక్స్టీరియర్గా స్టయిలుష్ లుక్ను జత చేసింది. ఈ వాహనాల్లో 1.5 లీటర్ల పెట్రోల్, డిజీల్ ఇంజిన్లను అమర్చింది.