Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దక్షిణాది మార్కెట్లో మంచి వాటా కలిగి ఉన్న డెయిరీ సంస్థ తిరుమల మిల్క్ ప్రోడక్స్ట్ ముంబయికి చెందిన ప్రభాత్ డైయిరీని కొనుగోలు చేయనుంది. రెండు సంస్థల విలీనాన్ని విషయాన్ని ప్రభాత్ సంస్థ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. తిరుమల మిల్క్ మాత సంస్థ ప్రాన్స్కు చెందిన గ్రూపీ లాక్టలీస్ తాజాగా ప్రభాత్ డెయిరీలో వాటాలను కొనుగోలు చేయనుందని ముంబయి సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.1,700 కోట్లుగా ప్రకటించింది. 2017-18లో ప్రభాత్ డెయిరీ విక్రయాల విలువ రూ.1,554 కోట్లుగా నమోదైంది. ఈ డీల్ పూర్తికావడానికి పట్టే సమయాన్ని మాత్రం ప్రభాత్ డెయిరీ వెల్లడించలేదు. ఈ ఒప్పందానికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉంది. సోమవారం ట్రేడింగ్ ముగిసేనాటికి ప్రభాత్ డెయిరీ మార్కెట్ విలువను రూ. 909కోట్లుగా నిర్ణయించారు. ప్రభాత్ డెయిరీ వ్యాపారంతోపాటు అనుంబంధ సంస్థ అయిన సన్ఫ్రెష్ ఆగ్రోలో వాటాలను విక్రయించేస్తున్నారు. ఈ డీల్ ప్రకటన నేపథ్యంలో ప్రభాత్ డెయిరీ స్టాక్ దాదాపు 14 శాతం మేర కుంగింది. విక్రయం వార్తల నేపథయంలో ప్రభాత్ సంస్థ షేర్లు ఉదయం దాదాపు 20 శాతం మేర పెరిగి రూ.111కి చేరాయి. అయితే ఆ తరువాత ఈ డీల్తో వాటాదారులకు పెద్దగా మిగేలేది ఏమీ లేదంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ కౌంటర్లో అత్యధికంగా అమ్మకాలు నమోదు అయ్యాయి. దీంతో రోజువారి గరిష్ట స్థాయి నుంచి సంస్థ స్టాక్ దాదాపు30 శాతం మేర క్షీణించి రూ.79.5 శాతం వద్ద ముగిసింది.