Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: హీంద్ర అండ్ మహీంద్ర మరో సరికొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. చిన్న ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్యూవీ 300 పేరుతో సంస్థ కొత్త వెహికల్ను లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఇంజీన్ల ఎంపిక సౌకర్యంతో మహీంద్రా దీనిని ఆవిష్కరించింది. ఈ కొత్త వాహనం ప్రారంభ ధరను సంస్థ రూ. 7.90 లక్షలుగా నిర్ణయించింది, టాప్ వేరియంట్ ధర రూ.11.99లక్షలుగా ఉంది. నాలుగు సిలిండర్లతో కూడిన 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ్ 115 బీహెచ్పీ వద్ద 3750ఆర్పీఎంతో 300 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందించే సామర్థ్యం కలిగిన ఇంజిన్తో దీనిని రూపొందించారు. మరోవైపు పెట్రోలు వేరియంట్ను మూడు సిలిడర్లతో కూడిన 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో తీర్చిదిద్దారు. ఈ కొత్త వాహనం 110 బీహెచ్పీ వద్ద 200 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, కార్ప్లే, లాంటి ఫీచర్లను ఇందులో అదనంగా సంస్థ జోడించింది. అలాగే టాప్ ఎండ్ వేరియంట్లో 7 ఎయిర్బాగ్స్, డ్యుయల్ ఎల్ఈడీ డే టైం ల్యాంప్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ పార్కింగ్ అస్టిస్ట్ కెమెరా, 17 అంగుళాల డైమండ్ అల్లారు వీల్స్ లాంటి అత్యున్నత ఫీచర్లను మహీంద్రా ఈ కారులో అందిస్తోంది. ఈ వాహనం కాగా మారుతీ సుజుకీ బ్రెజ్జా, ఫోర్డ్ ఇకో స్పోర్ట్, టాటా నెక్సాన్కు గట్టిపోటీ ఇవ్వనుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.