Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు అండగా ఉంటూ, అన్ని విధాలా ఆదుకొనేందుకు రిలయన్స్ ఫౌండేషన్ (ఆర్ఎఫ్) ముందుకు వచ్చింది. జవానుల కుటుంబ పోషణతో పాటు వారి పిల్లల చదువులకయ్యే ఖర్చును తాము పూర్తిగా భరించనున్నట్టుగా రిలయన్స్ ఫౌండేషన్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. జవానుల త్యాగానికి ప్రతీకగా.. వారి సేవలను గుర్తు చేసుకుంటూ అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని తాము భావిస్తున్నామని రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. దీనికి తోడు ఉగ్రదాడిలో గాయపడిన జవానులకు ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉందని రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. రియలన్స్ ఇండిస్టీస్కు చెందిన దాతృత్వ సంస్థగా రిలయన్స్ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా పలు సామాజికోద్ధరణ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే.