Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిగుమతులపై కస్టమ్స్ సుంకం200% పెంపు
న్యూఢిల్లీ: శ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో రగిలిపోతున్న కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాల్లో పాకిస్థాన్పై తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ దేశానికి 'అత్యంతక ప్రాధానత దేశం' (ఎంఎఫ్సీ) హౌదాను ఉపసంహరించుకున్న ప్రభుత్వం.. తాజాగా శనివారం మరో వాణిజ్య ప్రతీకార చర్యకు దిగింది. పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని దాదాపు 200 శాతం మేర పెంచతున్నుట్టుగా ప్రకటించింది. ఎంఎఫ్సీ హౌదాను వెనక్కి తీసుకొంటూనే 200 శాతం పన్నును అమలులోకి తెచ్చామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో శనివారం వెల్లడించారు. సర్కారు తాజా నిర్ణయంతో పాకిస్థాన్ నుంచి మన దేశానికి ఎగుమతయ్యే దాదాపు రూ.3,482.3 కోట్లకు పైగా ఎగమతులపై తీవ్ర ప్రభావం పడనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ నుంచి ప్రముఖంగా పండ్లు, సిమెంట్, తోళ్లు, రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు భారత్కు దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు వీటిపై కస్టమ్స్ సుంకం పెంచడంతో రానున్న రోజుల్లో ఈ వస్తువులు మరింత ప్రియం అవుతాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.