Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ విపణిలో తన ప్రాధాన్యత తగ్గిపోతోందని భావిస్తున్న శాంసంగ్ సంస్థ తిరిగి తన పూర్వవై భవాన్ని చాటుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా కంపెనీలను దీటుగా ఆధునిక హంగులతో కొత్తకొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శాంసంగ్ ఎం10, ఎం20 పేరుతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చిన శాంసంగ్ సంస్థ త్వరలోనే ఎం30 పేరుతో మరో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్ భారత్లో అందుబాటులోకి తేనుంది. యువతే ప్రధాన ఆకర్షణగా శాంసంగ్ ఈ ఫోన్ను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సూపర్ ఆమ్లాయిడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 16, 5, 5 ఎంపీ సామర్థ్యం కలిగిన మూడు కెమేరాలతో కంపెనీ దీనిని తీర్చిదిద్దుతున్నట్టుగా సమాచారం. రూ.15వేల ప్రారంభ ధరతో ఎం30ని తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముందు వైపు 16మెగా పిక్సెల్ కెమెరాను అమర్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోనే సంస్థ ఈ కొత్త ఫోన్ను అందుబాటులోకి తేనున్నట్టుగా మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.