Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)ల్లో కొట్టుమిట్టా డుతున్న ఐడీబీఐను అదుకొనేందుకు ఎల్ఐసీ చర్యలు చేపట్టింది. దాదాపు రూ.12వేల కోట్లను ఐడీబీఐ ప్రొవిజన్ల నిమిత్తం ఎల్ఐసీ సమకూర్చనున్నట్టు తెలిసింది. జనవరి-మార్చి త్రైమాసికం ఎన్పీఏల ప్రొవిజన్ల ఏర్పాటుకు ఈమొత్తం అవసరమని అంచనా. మూడో త్రైమాసికానికి సంబంధించి ఐడీబీఐ నష్టాలు పెరిగి రూ.4,185 కోట్లకు చేరాయి. ఇదే తరుణంలో ఆదాయం కుంగి రూ.7,125 కోట్ల నుంచి రూ.6,190 కోట్లకు చేరింది. దీంతో ఎన్పీఏలు కూడా 24.72శాతం నుంచి 29.67శాతానికి చేరాయి. మొండిబకాయిల ప్రొవిజన్లు రూ.5,074కోట్లకు చేరాయి. ఎల్ఐసీ సంస్థ ఐడీబీఐ బ్యాంక్లో దాదాపు 51శాతం వాటాను కొనుగోలు చేయగా.. జనవరి 21నాటికి ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి అయింది. బ్యాంక్ మొత్తం రూ.21,624 కోట్లమేరకు మూలధనాన్ని సమకూర్చుకున్నది. ఇటీవల ఐడీబీఐ బ్యాంక్ మూలధన అవసరాలను తీర్చే అంశాన్ని బ్యాంక్, ఎల్ఐసీ అధికారులు కేంద్ర ఆర్థికశాఖ ముందుకు తీసుకొచ్చిన విషయం విదితమే.