Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మొబైల్ టవర్ కంపెనీ ఇండస్ టవర్లోని వాటాలు, ఆప్టికల్ ఫైబర్లను అమ్మేసి రూ. 20వేల కోట్లు ఆర్జించేందుకు వొడాఫోన్ ఐడియా కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ సొమ్ముతో అప్పులను తీర్చుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది. 2018 ఏడాది చివరనాటికి కంపెనీ అప్పులు సుమారు 1.23 లక్షల కోట్ల మేరకు ఉన్నట్టు అంచనా. అమ్మకానికి పెట్టాలనుకుంటున్న మొబైల్ టవర్, ఆప్టికల్ ఫైబర్ల విలువ మొత్తం సుమారు రూ. 20వేల కోట్ల మేరకు ఉంటుందని కంపెనీ అంచనాకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై చర్చలు నడుస్తున్నాయని చెప్పారు. ఇండస్లోని వాటాలు సుమారు రూ. 5వేల కోట్లు ఉన్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. 1.56లక్షల కిలోమీటర్ల పొడుగున్న ఆప్టికల్ ఫైబర్ ఉన్నట్టు చెబుతూ... దాని విలువపై స్పష్టతనివ్వలేదు. అలాగే రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25వేల కోట్ల మేరకు సొమ్మును సమీకరించాలని కంపెనీ ప్రణాళికలు వేస్తున్నట్టు సమాచారం.