Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదో సెషన్లోనూ కొనసాగిన నష్టాలు
ముంబయి : దేశీయ మార్కెట్లు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ నష్టాల్లో ముగిశాయి. అంత ర్జాతీయంగా సంకే తాలు సానుకూలంగా ఉన్న ప్పటికీ, పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశంలోని ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో స్టాక్మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా అమ్మకాలకు మొగ్గుచూపడం మార్కెట్ వర్గాలను కలవర పరిచింది. ఈ ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్లో 190 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో దేశీయ మదుపరులు కూడా అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలయ్యాయి. దీంతో వరుసగా ఎనిమిదో రోజు సూచీల పతనం కొనసాగింది. మార్కెట్ ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేక పోయిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 310 పాయింట్ల నష్టంతో 35,498 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 10,641 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 71.38గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్స్, టాటామోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టీసీఎస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యస్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.