Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల వేళ మోడీ సర్కారు నజరానా
న్యూఢిల్లీ: దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో నజరానాను ప్రకటించింది. మంగళవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు డీఏ ను(డియర్నెస్ అలెవెన్స్) మరో మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అది 9 శాతం దరిదాపుల్లో ఉంది. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటను కలిగించేలా వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని పెంచిన ప్రభుత్వం.. నెల కూడా తిరగక ముందే డీఏను పెంచడం గమనార్హం. డీఏ పెంపు నిర్ణయం జనవరి 1 నుంచి పెన్షనర్లతో సహా ఉద్యోగులకు వర్తిస్తుందనిక్యాబినెట్ సమావేశం అనంతరం ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు కలుగనుంది. డీఏ పెంపు నిర్ణయం వల్ల ఖజానాకు దాదాపు రూ.9000 కోట్ల భారం పడనుంది.