Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తాజాగా క్యాబ్ దిగ్గజం ఓలాలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తాజాగా ఆయన ఓలా సంస్థలో దాదాపు రూ.650 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఓలాలో పెట్టిన అతిపెద్ద వ్యక్తిగత ఇన్వెష్ట్మెంట్ కూడా ఇదే కావడం గమానార్హం. ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ సంస్థ 16 బిలియన్ డాలర్లకు 77 శాతం వాటాలు కొనుగోలు చేయడంతో సచిన్ బన్సల్, బిన్ని బన్సల్లు బయటకు వచ్చేశారు. సచిన్ బన్సాల్ పెట్టుబడి అందడంతో ఓలా మరో క్యాబ్ దిగ్గజం ఉబెర్తో రానున్న రోజుల్లో భారీగా పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే ఓలా సచిన్ బన్సల్కు జే రౌండ్ ఫండింగ్లో భాగంగా రూ.150 కోట్లు విలువైన షేర్లను కేటాయింది. ''ఓలా భారత్లో వినియోగదారల విశ్వాసాన్ని చూరగొంది. వారి ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థలో భాగస్వామిగా మారడం నాకు ఆనందాన్ని ఇస్తోంది'' అని సచిన్ బన్సల్ ఈ సందర్భంగా తెలిపారు. ఓలా సంస్థ గత ఏడాది దాదాపు బిలియన్ డాలర్లను సమీకరించాలని నిర్ణయించింది. గత అక్టోబర్లో చైనాకు చెందిన టెన్సెంట్ హౌల్డింగ్స్ సంస్థ ఓలాలా 1.1బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. దీనికి అదనంగా మరో బిలియన్ డాలర్ల నిధుల కోసం కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సచిన్ బన్సల్ పెట్టుబడులు సంస్థకు బాగా కలిసిరానున్నాయి.