Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలోనే 4 లక్షల వాహనాల అమ్మకం
న్యూఢిల్లీ: దేశం లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) విటార బ్రెజా అనూహ్య ఘనతను సొంతం చేసుకుంది. అమ్మకాలలో ఈ వాహనం నాలుగు లక్షల యూనిట్ల మైలు రాయిని చేరుకుంది. బ్రెజా వాహనం మార్కెట్లోకి విడుదలైన కేవలం మూడేండ్ల కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకుందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సెల్స్) ఆర్.ఎస్.ఖాల్సీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడేళ్ల కంపెనీ తయారు చేసే అత్యంతర ఆదరణ కలిగిన కార్లతో పోటీపడి మరీ బ్రెజా ఈ ఘనతను సొంతం చేసుకుందని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ఏడు శాతం వృద్ధితో సంస్థ అమ్మకాలు జరుగుతున్నా యన్నారు. నెలకు సగటున 14,675 విటారా బ్రెజా మోడల్ కార్లు విక్రయిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కాంపాక్ట్ ఎస్యువీ కార్ల విభాగంలో విటారా బ్రెజా వాహన అమ్మకాల వాటా 44.1 శాతం ఉందని కంపెనీ వెల్లడించింది. వాహనప్ర యులను అమితంగా ఆకర్షించిన మారుతి సుజుకీ విటార బ్రెజా కార్లు 2016 మార్చిలో భారత విపణిలోకి వచ్చాయని అప్పటి నుంచి ఈ వాహనానికి అదరణ పెరుగుతూనే వస్తోందని ఆయన తెలిపారు. అయితే ఈ మోడల్ కార్లలో ఎజీఎస్ (ఆటోమెటిక్ గేర్ షిఫ్ట్) మోడల్తో వచ్చిన కార్లు 20 శాతం అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది.