Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నేషనల్ పింఛన్ సిస్టమ్ (ఎన్పీఎస్) చందాదారులకు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం వచ్చేలా పింఛను ఫండ్ రెగ్యూలేటరీ పీఎఫ్ఆర్డీఏ కొత్త పథకానికి తుదిరూపును తెస్తున్నది. ఎన్పీఎస్ వద్ద దాదాపు రూ.2.91లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. కచ్చితమైన ఆదాయం రాబడి హామీ, రిలేటీవ్ రేట్ ఆఫ్ రిటర్ను హామీ వంటి అంశాలకు ఇంకా తుది రూపు ఇవ్వలేదని సమాచారం. దీనికి సంబంధించిన సూచనలు సలహాలు స్వీకరించాల్సి ఉన్నది. పలు భాగస్వామ్య సంస్థల నుంచి కనీస ఆదాయ పథకం తయారు చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టును ఆహ్వానించింది.ప్రస్తుతం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టుకు దరఖాస్తు చేసుకొనే సంస్థ ప్రభుత్వ రంగానికి చెందినదైనా, పబ్లిక్ సెక్టార్ యూనిట్, భాగస్వామ్య సంస్థ, లిమిటెడ్ లైబిలిటీ పార్టనర్ షిప్, ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ కానీ కావచ్చు. కనీసం ఐదేండ్ల నుంచి మనుగడలో ఉండాలి.