Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ఆదేశాలతో..
- అనిల్ అంబానీని వెంటాడుతున్న ప్రశ్నలు..!!
న్యూఢిల్లీ: 11 ఏండ్ల క్రితం ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థా నంలో, భారత్లో మూడోస్థానంలో ఉన్న అనిల్ అంబానీ వ్యాపార నిర్వహణలో చతికిలపడి అప్పుల ఊబీలో చిక్కుకున్నారు. అనిల్ నేతృత్వంలోని రిలయన్స్ అడా గ్ పలు వ్యాపార సంస్థలను నిర్వహిస్తోంది. తన సంప దకు వెన్నెముకగా ఉన్న ఆర్కామ్ ఇప్పుడు రూ.46000 కోట్లమేర అప్పుల ఊబీలో కూరుకుపోయింది. ఆర్కామ్కు చెందిన ఓ వివాదంపై ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. స్వీడన్కు చెందిన ఎరిక్సన్ అనే కంపెనీకి 4 వారాల్లోగా రూ.453 కోట్లు కట్టి తీరాలంటూ ఈ నెల 20న సుప్రీంకోర్టు ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే జైలుకు వెళ్లకతప్పదంటూ అనిల్ అంబానీని కోర్టు హెచ్చరించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ ట్టుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఎరిక్సన్ అనే కంపెనీకి రూ.550 కోట్ల బకాయి లు చెల్లించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. నాలుగు వారాల్లోగా ఎరిక్సన్కు రూ.453 కోట్లు చెల్లించకపోతే 3 నెలల జైలుశిక్ష విధిస్తామని ఈ నెల 20న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు హెచ్చరిం చింది. తీర్పు వెల్లడైన సమయంలో అనిల్ అంబానీ కోర్టు హాల్లోనే ఉన్నారు. తీర్పు రావడానికి ముందే కోర్టు రిజిస్ట్రీలో అనిల్కు చెందిన రిలయన్స్ రూ.118 కోట్లు డిపాజిట్ చేసింది. దాంతో, ఆ డబ్బును వారంలోగా ఎరిక్సన్కు పంపాలని ఆరోజే కోర్టు ఆదేశించింది. అనిల్కు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలీ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్ఫ్రోటెక్లు ఉద్దేశపూర్వకంగానే రూ.550 కోట్లు, వడ్డీ చెల్లించలేదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరణ్తో కూడిన ధర్మాసనం ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోర్టు రిజిస్ట్రీకి రూ.కో టి చొప్పున జరిమానా చెల్లించాలని, లేదంటే ఈ 3 సంస్థల చైర్పర్సన్లు అదనంగా మరో నెల జైలుశిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
2014లో కుదిరిన ఒప్పందంమేరకు భారత్లో ఆర్కామ్ నెట్వర్క్ను ఎరిక్స న్ ఇండియా నిర్వహిస్తోంది. అయితే, బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్కామ్పై అభియోగాలు మోపుతూ ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 20న ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనిల్ కంపెనీలు ఎరిక్సన్కు చెల్లించాల్సిన మొత్తం(వడ్డీతో కలిపి) రూ.571 కోట్లు అన్నది గమనార్హం.
అతిపెద్ద కుబేరుని స్థాయి నుంచి అప్పుల ఊబీలోకి
రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ 2002లో మరణించగా, ఆయన కుమారులు ముకేశ్, అనిల్ మధ్య ఆస్తి పంపకాలు 2005లో జరిగాయి. అనిల్ తన కంపెనీ పేరును రిలయన్స్ అడాగ్(అనిల్ధీరూభాయ్ అంబానీ గ్రూప్)గా మార్చుకోగా, ముకేశ్ కంపెనీ రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)గా కొనసాగుతోంది. కొంతకాలంపాటు అన్నతమ్ముల మధ్య వ్యాపార పోటీ బాగానే కొనసాగింది. 2008లో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 4300 కోట్ల డాలర్లతో ముకేశ్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో, 4200 కోట్ల డాలర్లతో అనిల్ ఆరోస్థానంలో నిలిచారు. భారత్లో ముకేశ్ రెండోస్థానంలో, అనిల్ మూడోస్థానంలో నిలిచారు. ఆ సమయంలో భారత్ నుంచి 4500 కోట్ల డాలర్లతో లక్ష్మీమిట్టల్ మొదటిస్థానంలో నిలిచారు.
ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న అనిల్ కంపెనీ ఆర్కామ్ రూ.46వేల కోట్లమేర అప్పుల ఊబీలో కూరుకుపోయింది. అనిల్ అంబానీ కుబేరునిగా వెలుగుతున్న సమయంలో ఆయన సంపదలో ఆర్కామ్దే 65 శాతం వాటా అన్నది గమనార్హం. ఇప్పుడు అదే కంపెనీ దివాలా పిటిషన్ వేసి, ఆస్తులు అమ్మడం ద్వారా అప్పులు తీర్చే పనిలో పడింది. అయితే, ఆస్తుల అమ్మకానికి చట్టపరంగా పలు చిక్కులు ఎదురు కావడంతో అనిల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ్ముడిని గట్టెక్కించేందుకు ముకేశ్ అంబానీ చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ముకేశ్ అంబానీకి చెందిన జియోకు అనిల్ కంపెనీ ఆర్కామ్ ఆస్తులు(స్పెక్ట్రమ్, వగైరా) అమ్మడం ద్వారా రూ.18,000 కోట్లమేర రాబట్టాలని చూశారు. అయితే, కొనుగోలుకు ఒప్పందం జరిగితే ఆర్కామ్కు చెందిన పాత బకాయిలను చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన వల్ల జియో వెనక్కి తగ్గింది. పాత బకాయిలతో తమకు సంబంధంలేకుండా ప్రభుత్వం హామీ ఇస్తే ముందుకు వెళ్లాలని ముకేశ్ కంపెనీ జియో ప్రణాళికగా తెలుస్తోంది.