Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం :జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజక్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేరళలో విజయవంతంగా అమలవు తున్న లాటరీ విధానాన్ని మార్చితే తీవ్రంగా వ్యతిరేకిస్తా మని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజక్ స్పష్టంగా చేశారు. ఈ విధానాన్ని మార్చాలని కేంద్రం యోచిస్తు న్నట్టు చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జీఎస్టీ కౌన్సి ల్ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత కేరళ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో థామస్ ఐజక్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం మార్పులపై కౌన్సిల్లో చర్చించినట్టు వివరించారు. ఈ విధా నంలో ఎటువంటి మార్పులు తీసుకోకూడదని కేంద్రానికి వివరించినట్టు వెల్లడించారు. తమ వాదనకు సుమారు పది రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. జీఎస్టీ లాటరీ విధానంలో మార్పులు తీసుకురావాలంటే అన్ని రాష్ట్రాల తో సంపూర్ణంగా చర్చలు జరపా లని సూచించారు. అయితే, కేంద్రప్రభుత్వం మాత్రం కొంతమేర ఒంటెత్తు పొకడలకు పోతుందని విమర్శించారు. ఈ విషయంపై సర్కారు, జీఎస్టీ కౌన్సిల్పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తాను ఇదివరకే బెంగాల్, పంజాబ్ ఆర్థిక మంత్రులతో మాట్లాడినట్టు తెలిపారు. కీలకమైన విషయాలకు సంబంధించిన అంశా లు లోతుగా చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, వీడియో కాన్ఫరె న్స్లోనో లేక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రాలకు ఏమాత్రం క్షేమక రం కాదని చెప్పారు. ప్రస్తుతానికి పంజాబ్ రాష్ట్రం ఎటువంటి లాటరీ విధానాన్ని అవలంభించడం లేదని చెప్పారు. అయితే, అమలు విషయంలో ఆ రాష్ట్రానిక సాంకేతిక అంశాల్లో సాయ పడేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. లాటరీ విధానం ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరానికి తమ పన్నులు రూ. 11,863 వరకు పెరగనున్నట్టు తెలిపారు. అయితే, ఈ సమావేశంలో లాటరీ మార్పులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.