Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో సోమవారం ఒక్క శాతం మేర లాభపడ్డాయి. ఐటీ, విత్త స్టాక్స్ ప్రధాన మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ తుదకు 341 పాయింట్లు లేదా 0.95 శాతం రాణించి 36,213కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు లేదా 0.82 శాతం లాభపడి 10,880 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఏడు స్టాక్స్ మాత్రమే నష్టపోగా.. మిగితా స్టాక్స్ లాభపడ్డాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, ఇండుస్ఇండ్ బ్యాంకు, హెచ్సీఎల్ టెక్ సూచీలు 1.87 శాతం నుంచి 3.25 శాతం మేర పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. కోల్ ఇండియా, ఎస్బీఐఎన్, కొటాక్ బ్యాంకు, రిలయన్స్ ఇండిస్టీస్ స్టాక్స్ 0.39 శాతం వరకు నష్టపోయిన వాటిలో ముందువరుసలో ఉన్నాయి. నిఫ్టీలో ఐటీ స్టాక్స్ 2.03 శాతం, బ్యాంకింగ్ 1.09 శాతం, ఆటో 1.12 శాతం చొప్పున అధికంగా పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. బీఎస్ఈలో మిడ్క్యాప్ 0.43 శాతం, స్మాల్ క్యాప్ 0.74 శాతం చొప్పున రాణించాయి.