Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత వాయుసేన దశాలు మట్టుబెట్టిన సంఘటనతో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జా తీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. పాక్లోని ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపు దాడులు చేసిందన్న వార్తలు మంగళవారం దేశీయ మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. ఈ పరిణామం యుద్ధానికి దారి తీయొచ్చనే విశ్లేష ణల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో తీవ్ర ఊగిసలాట నడుమ రోజంతా సూచీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు గురయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు మేర పతనమైంది. ఆ తరువాత నమోదైన కొనుగోళ్లలో చివరకు సూచీలు కొంత కోలుకున్నాయి. ట్రెడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఏకంగా 240 పాయింట్ల నష్టంతో 35,974 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,835 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. రూపాయి రివకరీ అవ్వడంతో ఐటీ, ఫార్మా షేర్లు లాభపడటం వల్ల సూచీల నష్టాలు కొంత తగ్గాయి. నిఫ్టీ 50లో జీ ఎంటర్టైన్మెంట్, టాటా మోటార్స్, ఐఓసీ, కోల్ ఇండియా, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, గెయిల్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఏకంగా 6 శాతానికి పైగా ర్యాలీ చేసింది. టాటా మోటార్స్ 4 శాతా నికి పైగా పెరిగింది. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌ సింగ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హీరో మోటొకార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. హెచ్డీ ఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం మేర పడిపోయాయి. రిలయన్స్ 1 శాతం తగ్గింది. సెక్టోరల్ ఇండె క్స్లు మిశ్రమంగా ముగిశాయి.బీఎస్ఇలో మిడ్క్యాప్ స్టాక్స్ 0.27 శాతం, స్మాల్క్యాప్ స్టాక్స్0.5 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. సెన్సెక్స్లో ఎనిమిది స్టాక్స్ మినహా మిగితా 22 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. దీంతో రానున్న రోజుల్లోనూ పతనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.