Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీ రేట్ల తగ్గింపునకు కొనసాగింపుగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 0.10 శాతం కోత పెట్టింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మార్చి 1వ నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో సంవత్సరాల కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటు 8.55 శాతం నుంచి 8.45 శాతానికి దిగి రానుంది. మూడేళ్ల కాల రుణాల రేట్లు 8.65శాతంగా ఉండనున్నాయి. కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేత త్వంలోని మానిటరీ పాలసీ తాజా ద్రవ్య పరపతి విధాన సమీకలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలను అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు వినియోగదారులకు అందించాలని శక్తికాంత దాస్ ఇటీవల స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.