Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మార్కెట్లోకి అధునా తన ఇగ్నిస్ కారును మార్కెట్లోకి ఆవిష్క రించింది. ఇగ్నిస్ 2019 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను కంపెనీ రూ.4.79 లక్షలుగా (ఎక్స్షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించింది. ఈ కారులో హైఎండ్ మోడల్ ధరను సంస్థ 7.14 లక్షల మధ్య నిర్ణయించింది. 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజీన్ సామర్థ్యంతో పెట్రోలు వెర్షన్ను మాత్రమే కొత్త కారును సంస్థ ఆవిష్కరించింది. రూఫ్ రెయిల్స్ లాంటి సరికొత్త భద్రతా ఫీచర్లతో పాటు, ఇతర మార్పులతో అపడేటెడ్ వెర్షన్నుగా దీనిని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త ఇగ్నిస్ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి భద్రతా ఫీచర్లను కూడా జత చేశారు. వినియోగదారులకు అభిరుచులకు తగ్గట్టుగా తగిన మార్పులతో దీన్ని తయారు చేసినట్లు ఆ కంపెనీ తెలిపింది.