Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఏ30 ని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దాదాపు 6.4 అంగుళాల తెరతో దీనిని తీర్చిదిద్దారు. దీని ధర వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు. వెనుక భాగంలో 16, 5 మెగా పిక్సల్ కెమెరాలు రెండింటిని అమర్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జిబి ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, యుఎస్బీ టైప్ సీ, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లోని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లుగా ఉండనున్నాయి.