Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
ముంబయి: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద నెలకొన్న యుద్ధ వాతావరణం బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఈ పరిణామంతో ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 466 పాయింట్లు పతనమైంది. తుదకు తాజా కొనుగోళ్లతో కోలుకున్న స్టాక్ మార్కెట్లు 68 పాయింట్ల నష్టంతో 35,905 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 36,138 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో కొనుగోళ్ల మద్దతుతో 36,371 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం అమ్మకాల ఒత్తిడితో ఏకంగా 35,735 కనిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్లో 17 స్టాక్స్ లాభపడగా.. 13 స్టాక్స్ నష్టపోయాయి. మిడ్క్యాప్ 0.40 శాతం, స్మాల్క్యాప్ 0.17 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్లో టాటా మోటార్స్, వేదాంత, హెచ్యుఎల్, కొటాక్ మహీంద్రా బ్యాంకు, ఎన్టిపీసీ షేర్లు 3.07 శాతం వరకు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు షేర్లు 2.11 శాతం వరకు అధికంగా లాభపడిన వాటిలో టాప్లో ఉన్నాయి. రెండు దేశాల మధ్య యద్ధ వాతావరణం నేపథ్యంలో రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలాయి.