Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రానికి దిగ్గజం కంపెనీ షావోమి భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఆండ్రా యిడ్ 8.1 ఓరియో ఆధారిత 32 అంగుళాల స్మార్ట్ టీవీని సంస్థ గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'ఎంఐ ఎల్ఈడీ 4ఏ ప్రో' పేరుతో దీన్ని సంస్థ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను కంపెనీ రూ.12,999గా నిర్ణయించింది. 32 అంగు ళాల హెచ్డీ డిస్ప్లే , 1366 , 768 పిక్సెల్స్ రిజల్యూషన్ ఫిక్చర్, 1జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్, లేటెస్ట్ అమ్లోజిక్ 64 బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజీన్, గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్లు ఈ టీవీలోని ఇతర ప్రత్యేకతలు. ఈ నెల 7వ తేదీ నుంచి మై హౌం, ఎంఐ.కాం, ఫ్లిప్కార్ట్ పోర్టల్స్ ద్వారా ఈ టీవీ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.