Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: చైనా కంపెనీల స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లో వేగంగా విస్తరిస్తున్న వేళ.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ పోటీని తట్టుకొనేందుకు గాను కొత్తకొత్త స్మార్ట్ఫోన్లను విపణిలోకి విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవలే ఎం 30 స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చిన శాంసంగ్ కేవలం రెండు మూడు రోజుల గ్యాప్తో శాంసంగ్ గెలాక్సీ ఏ సరీస్లో కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2019 ఏ సిరీస్లో సంస్థ గురువారం కొత్తగా మూడు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఎ10, గెలాక్సీ ఏ30, గెలాక్సీ ఏ50 పేరుతో వీటిని సంస్థ అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ ఏ10 ఫోన్ ధరను సంస్థ రూ.8,490గా నిర్ణయించింది. ఇదే సమయంలో సంస్థ గెలాక్సీ ఏ30 స్మార్ట్ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.16,990గాను, గెలాక్సీ ఏ50 ఫోన్ ప్రారంభ ధరను కంపెనీ రూ.19,990 నుంచి రూ.22,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ఫోన్లను డిస్ల్పే, కెమేరా వాటి పనితీరును బాగా ఆధునికీ కరిస్తూ కంపెనీ వీటిని రూపొందించింది. ఈ ఫోన్లను కంపెనీ హెచ్డీ ప్లస్ సూపర్ ఆల్మోన్డ్ ఇన్ఫినిటీ యూ డిస్ల్పేతో అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ సరీస్కు ఆదరణ తగ్గుతున్న వేళ దానిని ఆధునికీక రిస్తూ పలు మోడళ్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువస్తు న్నట్టగా కంపెనీ తెలిపింది.