Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భరత్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తల దాచుకుంటున్న విజరు మాల్యా ఎప్పుడు స్వదేశానికి వస్తారని బాంబే హైకోర్టు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పారిపోయిన ఆర్థిక నేరగాడి ట్యాగ్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాల్యా బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ సరంగ్ కొత్వాల్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించింది. ఆర్థిక నేరగాడిగా ప్రకటించడం వల్ల మాల్యా ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తే రుణదాతలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశారు కోర్టుకు తెలియజేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను స్వచ్ఛందంగా చెల్లిస్తానని మాల్యా ఇప్పటికే చెప్పారని ఆయన న్యాయస్థానానికి తెలిపారు.