Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఎస్బీఐ లైఫ్ ఇన్షూరెన్స్ సంస్థలో ప్రముఖ ఇన్వెష్ట్మెంట్ సంస్థ కార్లైల్ గ్రూపు వాటాను కొనుగోలు చేసింది. బీఎన్పీ పారిబస్తో జరిపిన బల్క్డీల్ ద్వారా సంస్థ ఈ వాటా కొనుగోలును చేపట్టింది. ఎస్బీఐ లైఫ్ సంస్థలో భారతీయ స్టేట్ బ్యాంక్తో పాటు బీఎన్పీ పారిబస్ కార్డిఫ్లు ఉమ్మడి వెంచర్ కంపెనీ. తాజా లావాదేవీతో ఎస్బీఐ లైఫ్లో బీఎన్పీ పారిబస్ కార్డిఫ్ సంస్థ వాటా 12.8 శాతానికి, సీఏ ఎమరాల్డ్ ఇన్వెష్ట్మెంట్ (కార్లైల్ గ్రూపు బిలియన్ ఫండ్) వాటా 9 శాతానికి, ఎస్బీఐ వాటా 62.1 శాతానికి చేరినట్టయింది. ఈ వాటా కొనుగోలులో భాగంగా సీఏ ఎమరాల్డ్ ఇన్వెష్ట్మెంట్ సంస్థ ఎస్బీఐ లైఫ్కు చెందిన దాదాపు తొమ్మిది కోట్ల మేర వాటాలను కొనుగోలు చేసినట్టుగా సంస్థ తెలిపింది. భారత్లోని జీవిత బీమా విభాగంలో ఆధిపత్యాన్ని మరింతగా ముందుకు తీసుకు పోయే ప్రయత్నంలో భాగంగా కార్లైలీ తమపై చూపిన విశ్వాసం రానున్న రోజుల్లో సంస్థను మరింత ముందుకు తీసుకుపోయేందుకు దోహదం పడగలదని ఎస్బీఐ లైఫ్ ఎండీ, సీఈవో సంజీవ్ నౌటిల్య తెలిపారు. ఈ పరిణామం నేపథ్యంలో బీఎస్ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో ఎస్బీఐ లైఫ్ ఇన్షూరెన్స్ వాటాలు ఆదిలో కొంత కుంగినప్పటికీ తిరిగి కోలుకున్నాయి.